Connect with us

Andhrapradesh

సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…

Published

on

243 Views

సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…

బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకుందాం…

ఏ దేవుడు ఏ మతము రక్తపాతాన్ని కోరదు…

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన…

కర్నూలు / ఆలూరు అక్టోబర్ 16 :- దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి సన్నిధిలో బన్ని ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ… ఏ దేవుడు ఏ మతము రక్తపాతాన్ని కోరుకోదని , సాంప్రదాయాన్ని , ఆచార వ్యవహారాలు పాటిస్తూ పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని సమావేశానికి హాజరైన ఉత్సవ కమిటీ సభ్యులను , గ్రామస్తులను ,అధికారులను కోరారు.

ఈనెల దసరా ఉత్సవాల సందర్భంగా 24వ తారీఖు రాత్రి జరుగు మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణము సందర్భంగా జరుగు బన్ని ఉత్సవానికి రాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా దాదాపు లక్ష యాభై వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాళ మల్లేశ్వర స్వామి సన్నిధిలో సమీక్షించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులను, అధికారులను మరియు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయ సాంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ క్రమశిక్షణతో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని గాయాలు పాలు కాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. ఏ దేవుడు ఏ మతము రక్తపాతము కోరుకోదని తెలిపారు. పూర్వకాలంలో నడక ద్వారా మాళ మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాత్రివేళ భక్తులు వచ్చేవారు .ఆ సమయంలో జంతువులు, విష సర్పాల భారి నుండి కాపాడుకోవటానికి గాను కర్రలను వాటికి శబ్దం చేసే గజ్జలు , రింగులు వాడుకోవడం ఆనవాయితీగా ఉన్నది. ఆ కర్రలతో రాత్రి వేళలో తమను తాను రక్షించుకోవడానికి మరియు ఎత్తైన కొండలు అధిరోహించడానికి వాడేవారు . ఇప్పుడు ఆ కర్రలను బన్ని ఉత్సవం సందర్భంగా ఇతరులను గాయపరచడానికి వాడటం సరికాదని తెలిపారు. దేవుని పేరుతో ఏ సాంప్రదాయము హింసను కోరుకోదని కావున కర్రలు వినియోగించరాదని హితవు పలికారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూరుస్తామని ఉత్సవాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు గౌరవించాలని అదే సమయంలో ఇతరులను బాధపెట్టే విధంగా ప్రవర్తించరాదని తెలిపారు . ఈసారి బన్ని ఉత్సవాలకు దాదాపు 100 రాత్రి వీడియో కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని , దాదాపు 5 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నామని , అగ్నిమాపక యంత్రాలు , ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే సారా నియంత్రణ మరియు కర్రల స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టామని తెలిపారు . ప్రతి ఒక్కరి రక్షణ కొరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ విషయంలో ప్రజల సహాయ సహకారాలు కోరుకుంటున్నామని మీ సహకారంతో బన్ని ఉత్సవం ప్రశాంతంగా సంతోషంగా సాంప్రదాయ బద్ధకంగా జరుపుకుందామని కోరారు.

ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బన్ని ఉత్సవాల ఏర్పాట్ల సందర్భంగా ప్రసంగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని వసతులు , ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు .ఈ ప్రాంతం మొత్తం ప్రకాశవంతంగా ఉండడానికి ఎత్తైన లైట్లు , జనరేటర్ ఏర్పాట్లు చేస్తున్నామని , త్రాగునీరు , ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . పరిసర గ్రామాల్లో ఈ ఉత్సవాల్లో మద్యాన్ని వాడకుండా , కర్రలు తీసుకొని రాకుండా సాంప్రదాయబద్ధంగా క్రమశిక్షణతో ఉత్సవాన్ని జరుపుకోవడానికి గాను అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . రాత్రిపూట స్పష్టంగా అగుపించే కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అసాంఘిక శక్తులు , క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని తెలిపారు.

కర్నూలు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ యం. రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా , వివాదరహితంగా జరుపుకోవడానికి సహకరించాలని , దేవాదాయశాఖ తరఫున అన్ని విభాగాలతో సహాయ సహకారాలు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు . అందుకు భక్తులు కూడా మా సేవలు వినియోగించుకోవాలని ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారి మనోహర్ స్వామి క్షేత్రం యొక్క మహత్యం ఆలయ ప్రాశస్త్యం తెలిపారు. మనోహర్ స్వామి మాట్లాడుతూ మనకున్న లెక్కల ప్రకారం 500 సంవత్సరాల క్రితం నుండి ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అప్పటినుండి ఇప్పటివరకు సాంప్రదాయంగా జరుపుకుంటున్నామని , ఇప్పుడు కూడా ప్రజలు దేవస్థానానికి , క్రమశిక్షణతో ఉండి ప్రభుత్వానికి సహకరించి ఉత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ వారు కూడా ఈ ఉత్సవాలను పరిశీలించి మెచ్చుకునే వారని తెలియజేశారు.

ట్రస్ట్ బోర్డు మెంబర్ వీరనాగ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి వచ్చే మార్గాన్ని సిసి రోడ్డు గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని , ఈ ప్రాంతంలోని రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయని వాటి విస్తరణకు కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

20 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
190 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

179 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters