Connect with us

Telangana

10 టీవీ రిపోర్టర్ తండ్రి మరణించిన విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుడు

Published

on

208 Views

మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం పరిధిలో.10 టీవీ రిపోర్టర్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పడం జరిగింది అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

Andhrapradesh

పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది సీతారాం ఏచూరి…… ఘనంగా సితారాం ఏచూరి కి నివాళి…

Published

on

147 Views

భారత దేశ రాజకీయాల్లో పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్,మాజీ విద్యార్థి సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ ఉచ్చిరప్ప, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు సిపిఐ మండల కార్యదర్శి నరసరావు మాజీ రైతు సంఘం నాయకులు ఉప్పర నరసప్ప లు పేర్కొన్నారు.

గురువారం నాడు దేవనకొండ మండల కేంద్రంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ స్థానిక ముగితాత ఆవరణలో జరిగింది.

పార్టీ జిల్లా నాయకులు బి వీర శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు సీతారాం ఏచూరి అని రాజకీయాలు ఏమైనా సమస్యల ప్రతిపాదికన చట్టసభల్లోను అదేవిధంగా పార్లమెంట్ బయట అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగ విలువలు కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణకై కట్టుబడి పని చేశారని పేర్కొన్నారు.

సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దళిత గిరిజన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాడినడ వ్యక్తి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు.

వివిధ భావాలు, సిద్ధాంతాలు ఉన్న రాజకీయాల్లో అందరినీ కలుపుకొని సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఉమ్మడి పోరాటం చేశారని పేర్కొన్నారు.

విద్యార్థి దశలోనే జేఎన్టీయూ నాయకుడిగా ఇందిరా గాంధీ నిలదీసి విసీ పదవికి రాజీనామా చేయించారని, విద్యార్థి నాయకుడిగా అందరికీ విద్యానదించాలనే పోరాటాన్ని దేశవ్యాప్తం చేశాడని పేర్కొన్నారు.

తదనంతర రోజుల్లో ప్రజా నాయకుడిగా తిరుగులేని నేతగా ఎదిగాడని భారతదేశ మౌలిక పరిస్థితులు సాంప్రదాయాలను అర్థం చేసుకొని దేశ ప్రజానీకానికి తగ్గట్టు చట్టాలు ఉండాలని పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు కమ్యూనిస్టు పార్టీలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన సీతారాం తన మేధస్సునంత ఉపయోగించి భారతదేశానికి విశేష సేవ అందించారని అనేక రైతాంగ కార్మిక విద్యార్థి యువజన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని విజయాలు సాధించారని పేర్కొన్నారు.

భారతదేశంలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి దౌత్యవ్యక్త గా వివాదాల పరిష్కారకునిగా భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారని పేర్కొన్నారు.

ఆయన నడిచిన బాటలో పేద మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడమే ఈరోజు మనందరి బాధ్యతని పేర్కొన్నారు. సీతారాం గారికి నిజమైన నివాళి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడమేనని భవిష్యత్తులో వామపక్షాలు ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడంలో అందరూ సహకరిస్తారని పేర్కొన్నారు.

సమ సమాజ నిర్మాణం కోసం ఆయన కన్న కలలు నిజం చేసే విధంగా నేటి కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుందని ఆ బాధ్యత నేటితరం భుజాన చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ఆ పార్టీ ప్రజాసంఘాల నాయకులు అశోక్, సూరి ,యుసుప్ బాషా, మహబూబ్ బాషా, బజారి, గాజుల శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, నాగేష్ ,మహేంద్ర ,నాగేంద్ర, బలరాముడు, వీరేంద్ర ,పరమేష్ ,జ్యోతి వెంకటేష్ ,మనోహర్ ,సుధాకర్, రవి ,సుభాన్ ,సుంకన్న, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Andhrapradesh

సీతారాం ఏచూరి మృతి వామ పక్షలకు ,దేశ రాజకీయాలకు తీరని లోటు…..సిపిఎం

Published

on

119 Views

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి  మృతి వామపక్షాలకి,అదే విధంగా దేశంలోని అభ్యుదయ లౌకిక, ప్రత్యామ్నాయా రాజకీయాలకు తీరనిలోటని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి. వీరశేఖర్ పార్టీ మండల కమిటీ సభ్యులు యూసుఫ్ భాష లు పేర్కొన్నారు.

సీతారం ఏచూరి గారి మృతి నేపథ్యంలో మండల కేంద్రం దేవనకొండలో ఆయనకు ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించాయి ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకులు అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చదువులో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఏచూరి  జేఎన్టీయూ ఢిల్లీ కేంద్రంగా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారని, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) లో చేరి అఖిల భారత అధ్యక్షులు పనిచేశారని తర్వాత జరిగిన పరిణామాలలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా నిలబడ్డారని జైలుకెల్లారని పేర్కొన్నారు.

నిరంతరం ప్రజల పక్షాన, కార్మికులు, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని , అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సమస్యలపై విశేష అవగాహనతో ఆయా దేశాలతో సత్సంబంధాలు నేర్పడంలో క్రియాశీలక పాత్ర పోషించే వారిని ఈ నేపద్యంలోనే భారత ప్రభుత్వం తరఫున నేపాల్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.

అభ్యుదయ ,లౌకిక ప్రత్యామ్నాయ రాజకీయాలలో మొదటి తరం నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ నేటికీ విశేష పోరాటాలు చేశారని దేశంలో అన్ని రాజకీయ పార్టీ లను ఒక వేదిక పైకి తీసుకురావడంలో విజయవంతం మైన పాత్ర నిర్వహించారని పేర్కొన్నారు ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి కాకుండా దేశ రాజకీయాలకు లోటని పేర్కొన్నారు.

మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా , అత్యుత్తమ రాజకీయవేత్తగా దేశానికి విశేష సేవ అందించాలని ఆయన లేని లోటు తీర్చలేనిదని భవిష్యత్తులో శ్రామిక వర్గ పోరాటాలే ఆయనకు ఘన నివాళి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ప్రజాసంఘాల నాయకులు పాండు, వెంకటేష్, కాంతయ్య, రవి, రాముడు, రంగన్న ,తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Andhrapradesh

గద్దెరాల్ల మారెమ్మ ట్రస్ట్ ఏర్పాటు నోటిఫికేషన్ రద్దు చేయండిగ్రామస్థులు, అయకట్టుదారులు, పూజారులు విన్నపం.

Published

on

212 Views

దేవనకొండ మండలం గద్దెరాల్ల గ్రామంలో ఉన్న ప్రసిద్ది గాంచిన మారెమ్మ అవ్వకి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ వారు నోటిఫికేషన్ ను ఇచ్చారు అయితే గ్రామంలో ఉన్న ప్రజలకు, పూజారులకు,ఉత్సవ కమిటీకి, ఆయకట్టదారులకు ఏమాత్రం తెలియకుండా దేవదాయ శాఖ వారు ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయటం న్యాయం కాదని తెలిపారు

ఈ ట్రస్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని తహసిల్దార్ వెంకటేశ్ నాయక్ కు సోమవారం గ్రామస్తులు అందరూ వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో పురాతన కాలం నుంచి దేవర ఉత్సవాలు ప్రతి రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరుగుతుందని అయితే 2003 కంటే ముందు గ్రామంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరగడం వలన గ్రామస్తులంతా ఏకమై దేవా లయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి చేర్పించాలని విన్నవించడంతో 2003లో గద్దర్ల మారెమ్మ దేవాలయాన్ని దేవదాయ శాఖ వారు విలీనం చేసుకున్నారన్నారు.

గడచిన పదేళ్లుగా ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా దేవర ఉత్సవాలను గ్రామస్తులు ఆయకట్టదారులు పూజారులు పోలీస్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జాతరలు జరిపించారని అయితే ఇప్పుడిప్పుడు దేవాలయ కమిటీ ఏర్పాటు చేయాలని ఎందుకు వచ్చింది అన్నారు.

ఇప్పటికీ గ్రామం చాలా ప్రశాంతంగా ఉందని కమిటీలు ఏర్పాటు చేస్తే గ్రామంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని కావున మా గ్రామంలో ప్రశాంత వాతావరణ ఉండాలని మా గ్రామానికి గ్రామంలో ప్రజలందరూ అలాగే వచ్చే భక్తులందరూ ప్రశాంతంగా ఉండాలంటే కమిటీ ఏర్పాటు చేయాలని నోటిఫికేషను తక్షణమే రద్దు చేయాలని వారన్నారు లేని పక్షంలో లేబర్ మినిస్టర్ గుమ్మనూరు జయరాం కి అలాగే జిల్లా కలెక్టర్ కి విన్నవించి అవసరమైతే ఆందోళన చేపట్టడానికి కూడా గ్రామస్తులు మహిళలు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూరన్న, సంజప్ప కౌలుట్ల, రామకృష్ణ , మోకసి కృష్ణ పూజారి సూరి నాగేష్ మోకాసి మహాదేవప్ప ఆంజనేయులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters