Andhrapradesh
కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి సిపిఐ బహిరంగలేఖ.. కరపత్రాల పంపిణీ, విస్తృత ప్రచారం.

కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. సిపిఐ
సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండలో కరపత్రాల పంపిణీ, విస్తృత ప్రచారం.

కర్నూలు జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేయడం జరిగిందని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్.నరసరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం దేవనకొండ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుగాంచిందన్నారు.జిల్లాలో పశ్చిమ ప్రాంతం నియోజకవర్గాలు వర్షాలు లేక కరువు కాటకాలకు నిలయంగా మారాయన్నారు.కరువు విలయతాండవం చేస్తున్నదన్నారు. ఈ ప్రాంతం ప్రజలు కనీసం తాగునీటి సైతం దొరకక అలమటిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈనెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పత్తి,వేరుశనగ, కంది, జొన్న, సజ్జ, కొర్ర,ఆముదము వంటి పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50వేల రూపాయలు, ఉల్లి, మిర్చి, ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, రైతులు బ్యాంకులలో తీసుకున్నటువంటి రుణాలను రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలు వలస పోకుండా అన్ని గ్రామాల్లో పనులు కల్పించి పని దినాలు 200 రోజులకు పెంచాలని, ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని, ఎల్ ఎల్ సి, హంద్రీ-నీవా కాల్వ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు జనవరి 15 వరకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని, జిల్లా అభివృద్ధి కొరకు పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ని డిమాండ్ చేస్తూ బహిరంగ లేక రాయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే రాబోయే రోజుల్లో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు సుల్తాన్, రామాంజనేయులు, మహబూబ్ బాషా,రవి, వెంకట్ రాముడు, మిన్నళ్ల రైతులు పాల్గొన్నారు.
Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh1 year ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh1 year ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh1 year ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh1 year ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh5 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh5 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Telangana1 year ago
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
-
Andhrapradesh12 months ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం