Connect with us

Andhrapradesh

ప్రతి ఎకరాకు నీరు వచ్చేవరకు ఐక్యంగా పోరాడుదాం..

Published

on

215 Views

30 గంటలు నిరవధిక దీక్షలో సంఘీభావం ప్రకటించిన కోట్ల సుజాతమ్మ ,గౌస్ దేశాయ్.

అధికారుల, ప్రజాప్రతినిధుల హామీతో దీక్ష విరమణ.

హంద్రీ నీవా నుండి గుండ్లకొండ దగ్గర స్లుయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ, మాచాపురం గ్రామాల వరకు నీళ్లు ఇవ్వాలని అదేవిధంగా మండలంలోని చెరువులన్నిటిని  కి హంద్రీ ద్వారా నీటిని నింపాలని  డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ రైతు,వ్యవసాయ కార్మిక సంఘాలు 30 గంటలు నిరవధిక దీక్షలో భాగంగా గురువారం నాడు తెలుగుదేశం సిపిఎం  పార్టీల జిల్లా నాయకులు పలువురు ఎంపీటీసీలు  సర్పంచులు మద్దతు ప్రకటించారు.

నిరవధిక దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ,సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఎంపీటీసీ సభ్యులు విజయ గౌడ్,భాస్కర్, తపాల శ్రీనివాసులు పాల్గొని సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవనకొండ మండలం తీవ్ర కరువు ప్రాంతమని కరువు పరిష్కారంగా హంద్రీనీవా వచ్చిందని 46 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ నిర్దిష్టంగా ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేకపోతుందని పంట కాలువలు తవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

అదేవిధంగా అవకాశం ఉండి అనేక మంది ప్రజలకు, గ్రామాలకు ఉపయోగకరంగా ఉండే గుండ్లకొండ దగ్గర హంద్రీనీవా కు స్లుయిజ్ ఏర్పాటు చేసి దాదాపు పది, పన్నెండు గ్రామాలకు సాగును ఇచ్చే అవకాశం ఉన్న పాలకుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు కరువు ప్రకటిస్తున్న రైతులకు నిర్దిష్టంగా ఆదుకునే చర్యలు లేవని పేర్కొన్నారు.

ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని అయితే సాగునీటిపై పాలకులకు ,ప్రభుత్వ అధికారులకు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు మండలంలోని నేలతలమరి,గుండ్లకొండ, గుడిమరాళ్ల ,బంటుపల్లి, బేతపల్లి, బండపల్లి, చెలిమిచెలమిల కోటకొండ గ్రామాల చెరువులకు హంద్రీనీవా ద్వారా నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు పలు దఫాలుగా మంత్రికి ,కలెక్టర్ సాగునీటి జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేశారని అయినా ప్రభుత్వం తాత్పర్యం చేయడం సబబు కాదని పేర్కొన్నారు.

రైతుల సాగునీటి సమస్య చెరువులకు నీళ్లు మళ్లించే అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని రైతులు చేసే ఉద్యమాలకు మా పూర్తి సహకారం సంఘీభావం ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వంపై రైతుల పట్ల సాగు నీరు పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని , ఈ ప్రాంత సాగునీరు కోసం రైతులు, రైతు సంఘాలు , సీపీఎం పార్టీ చేసే ఆందోళనల కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా పాల్గొంటామని వారు పేర్కొన్నారు

ఎంపీడీవో కార్యాలయం ను ముట్టడించిన రైతులు.

30 గంటలు సాగునీరు కోసం నిరవధిక దీక్ష చేస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సబబు కాదని రైతు ద్వారానే అన్నం అందరికీ వస్తుందని అన్నం పెట్టే రైతు పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం మంచిది కాదని, సాగునీరు సమస్యపై మండల సర్వసభ్య సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం దగ్గర సాగునిరు ఇవ్వలని చెరువులకు నీళ్ళు మళ్లించాలని రైతుల పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఆందోళన దిగారు రైతులు సాగునీరుకై తీర్మానం చేయాలని రైతుల డిమాండ్ చేశారు. సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎంపీడీవో డిప్యూటీ తాసిల్దార్ హంద్రీ నీవా జేఈ మరియు ఎంపీటీసీలు, సర్పంచులు ఈ సమస్య పట్ల పరిష్కరించడంలో మేము కూడా సహకరిస్తామని సహకరించడమే కాకుండా సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి అందజేస్తామని వారు పేర్కొన్నారు.

దీక్ష విరమించాలని వారు కోరారు ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు రైతులు అధికారుల హామీ మేరకు దీక్షా శిబిరం దగ్గరకు ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చి నిరవధిక చేస్తున్నటువంటి రైతులు ,రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు వచ్చి ఎంపీపీ గారు వైఎస్సార్ సిపి నాయకులు లుముంబా, డిప్యూటీ తాసిల్దార్ సుదర్శన్, హంద్రీనీవా జే.ఇ- లక్ష్మీనారాయణ వ్యవసాయ శాఖ అధికారి సురేష్ తదితరులు దీక్షలో కూర్చున్న వారికి,నిమ్మరసం ఇచ్చి దీక్షను వివరింపజేశారు.

ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి సూరి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ పత్తికొండ నాయకులు దస్తగిరి రైతు వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు యువజన సంఘాల నాయకులు శ్రీనివాసులు వీరేంద్ర సుధాకర్ లింగన్న నాగేష్ యూసుఫ్ మహేంద్ర నాగేంద్ర రాయుడు లక్ష్మి రెడ్డి గుండ్లకొండ, గుడిమరాళ్ల, బంటుపల్లి ,కోటకొండ,రైతులు వెంకటస్వామి, వెంకటరాముడు, కృష్ణ, కౌలుట్ల శేషిరెడ్డి, శ్రీనివాసులు, దేవన్న, బయప్ప, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, స్వాములు, మార్కండేయులు గుడిమిరాల సర్పంచ్ శేషి రెడ్డి వెలమకూరు సర్పంచ్ భాస్కర్ , చెల్లెల చిలిమేల సర్పంచ్ శ్రీరా మప్ప బేతపల్లి సర్పంచు మహేశ్వర్ రెడ్డి, బండపల్లి సర్పంచ్ ఆంజనేయ తదితరులు సంఘీభావంగా పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

22 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
193 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

183 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters