Connect with us

Andhrapradesh

రైతు సంఘం అఖిల భారత కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయండి.

Published

on

175 Views

దేశంలో అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి విజయాలకు దిక్సూచిగా నిలిచిన అఖిలభారత రైతు సంఘం కౌన్సిల్ సమావేశాలు కర్నూల్ నగరంలో ఈనెల 15,16,17 తేదీలలో జరగబోతున్నాయని ఈ సమావేశంలో జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ రైతు సంఘం మండల కార్యదర్శి సూరి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ సీనియర్ నాయకులు నాగేష్ లు కోరారు.


ఈ మేరకు దేవనకొండ మండల కేంద్రంలో స్థానిక హమాలి వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు రైతు సంఘం అఖిల భారత కౌన్సిల్ సమావేశాల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అదేవిధంగా, కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా దేశంలోని పాలకులు పరిశ్రమలనే కాకుండా వ్యవసాయాన్ని కూడా ఆదా నీ, అంబానీ కి అప్పచెప్పాలన్న దుర్మార్గమైన కుట్రల కు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు నిర్వహిస్తున్న ఏ కె ఎస్ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు నాందిగా కర్నూల్ నగరంలో జరగబోయే కౌన్సిల్ సమావేశాలు వేదిక కాబోతున్నాయి.

అదేవిధంగా ఘనమైన చరిత్ర గల అఖిల భారత రైతు సంఘం 1936 సంవత్సరం ఏర్పడి న నాటి నుండి దేశ స్వాతంత్ర ఉద్యమంలో రైతులను సమీకరించడమే కాకుండా భూస్వామ్య ,పెత్తందారీ, జమీందారీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయాల సాధించింది. అందులో ప్రధానమైనవి వీర తెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటం,కేరళ పున్నపు వ్రాయిలర్ పోరాటం, బెంగాల్ లో భూమి బుక్తి విముక్తి పోరాటం, మహారాష్ట్ర ఆదివాసి వర్లీ పోరాటం పంజాబ్లో కౌలు రైతుల అండగా పోరాటలు గణతకేక్కాయి.ఈ నేపథ్యంలో నేడు కనీస మద్దతు ధర రైతాంగానికి సాగునీరు,అందుబాటులో బ్యాంక్ రుణాలు, కార్పెట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా నిత్యం పోరాటాలు చేస్తుంది

ఈ నేపథ్యంలో జరగబోయే కౌన్సిల్ సమావేశాలను మండల రైతాంగం జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నాగరాజు రాయుడు రాముడు మహేంద్ర మహేష్ రంగస్వామి కథలు తదితరులు పాల్గొన్నారు

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

20 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
190 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

180 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters