Connect with us

Andhrapradesh

రైతులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

Published

on

203 Views

తక్షణమే పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలి.

బ్యాంకుల్లో రైతుల అప్పులను షరతులు లేకుండా రద్దు చేయాలి.

కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం.

సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండ తహశీల్దార్ కార్యాలయం ముట్టడి. డిమాండ్

ఈ ఖరీఫ్ సాగు లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పోరాటాల ఫలితంగా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు కానీ నేటికీ నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా పాలక వర్గం చేయక పోవడం చాలా అన్యాయమని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కె.మద్దిలేటిశెట్టి ఆరోపించారు.

ఈ సందర్భంగా సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సీపీఐ కార్యాలయం నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ రైతులతో కలిసి వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏపీ రైతుసంఘం మండల కార్యదర్శి ఎమ్.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కే. మద్దిలేటిశెట్టి హాజరై మాట్లాడుతూ జిల్లాలో సిపిఐ నిర్వహించిన పోరాటాల ఫలితంగా 24 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది,దీని కారణంగా రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 20 మందికి పైగా రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదన్నారు.

ఏ సీజన్లో రైతులు పంటలు నష్టపోతే ఆ సీజన్లోనే పంట నష్టపరిహారం ఇస్తామని ప్రచారం చేసుకుంటున్న C.M జగన్ రెడ్డి కరువు మండలాలపై, పంట నష్టపరిహారం పై నోరు మెదపడం లేదన్నారు.

దీని కారణంగా రైతులకు ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు.తక్షణమే జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని,పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలని అన్నారు.

సీపీఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు మాట్లాడుతూ దేవనకొండ మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు.పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పత్తి,వేరుశనగ, ఆముదము,కంది,జొన్న, కొర్ర,సజ్జ,పంటలకు ఎకరాకు 40 వేల రూపాయలు నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలన్నారు.

అలాగే ఉల్లి,మిర్చి,ఉద్యాన వన పంటలకు 1లక్ష రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. మండలంలో ఏర్పడిన త్రాగునీటి సమస్య కు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల గౌరవాధ్యక్షులు వై.కండప్ప, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరసింహులు,పట్టణ సహాయ కార్యదర్శి వి.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సి.కృష్ణ, గుడిమిరాళ్ల శాఖ కార్యదర్శి తుకారాం,నల్లచెలిమల శాఖ కార్యదర్శి బజారి,ప్యాలకుర్తి శాఖ కార్యదర్శి అశ్వత్ధామ,కరివేముల బాలాజీ,రైతు సంఘం నాయకులు ప్రసాద్, కిష్టన్న, పెద్ద రంగన్న, హనుమంతు, బాషా, శ్రీనివాసులు, రంగస్వామి, వీరంజినేయులు, ఈరన్న, విద్యార్థి,యువజన సంఘం నాయకులు మధు,రామంజి, తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

22 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
193 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

183 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters