Andhrapradesh
రైతు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి

కార్పొరేట్లకు రెడ్ కార్పొరేట్ రైతుల పై ముళ్ళ బుల్లెట్లు కురిపిస్తున్న మోడీ.
దేవనకొండ -/ నేటి భారత్ : కేంద్రంలోనీ నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రెడ్ కార్పొరేట్ల పరుస్తూ రైతాంగం పై ముళ్ల బుల్లెట్లు వర్షం కురిపిస్తుందని ఈ దుర్మార్గం వైఖరిని ఖండించాలని అదేవిధంగా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే మద్దిలేటి శెట్టి లు డిమాండ్ చేశారు,
రైతుల కనీస మద్దతు ధర, స్కీం వర్కర్ల కనీస వేతనాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా దేవనకొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుండి ర్యాలీ, బస్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతు గతంలో వేలాది మందితో రైతంగం చేసిన ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం రంగం లోని నల్ల చట్టాలను రద్దు చేస్తాను అని హామీ ఇచ్చి, వాటిని అమలుపరచడానికి తిరిగి ప్రయత్నం చేస్తున్నది .విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందు పెట్టి ఉచిత విద్యుత్ కు మంగళం పాడి రైతుల పై పెనుబారం మోపడానికి సిద్ధమైందని,కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్యావసర వస్తువుల్ల అన్నిటి పైన జిఎస్టి పేరుతో పన్నులు పెంచిందని అన్నారు .గత 10 సంవత్సరంలో బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాలు వల్ల అదాని, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా ,పేద ప్రజలు, రైతులు ,కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు లక్ష యాభై వేల మంది బలస్మరణం పాలయ్యారని వారన్నారు.
మండలంలో సంవత్సరం వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలై బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలు వలసలు పోతున్నరని రైతులు ఎకరానికి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని మండలాన్ని ప్రభుత్వము కరువు మండలంగా ప్రకటించి, ప్రభుత్వం కరువు సాయం ఇవ్వడం లేదని విమర్శించారు రైతులకు పంట నష్ట పరిహారం అందించి, బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికే 200 కల్పించాలని ,స్కీం వర్కర్లకు 26వేల వేతనం ఇవ్వాలని, దుర్మార్గంగా కార్పొరేట్ లకు ఆనుకూలంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఉభయ రైతు సంఘల మండల కార్యదర్శిలు సూరి, వెంకటేశ్వర్లు సిఐటియు సీనియర్ నాయకుడు నాగేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బజారి, పరమేష్, యూసుఫ్ భాష, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు శ్రీరాములు ,బడే సాబ్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం యువజన సంఘాల నాయకులు కే పి రాముడు, లక్ష్మిరెడ్డి, బలరాముడు, నాగేంద్ర, వీరేంద్ర ,రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh1 year ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh1 year ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh1 year ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh1 year ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh5 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh5 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Telangana1 year ago
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
-
Andhrapradesh12 months ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం