Connect with us

Andhrapradesh

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.

Published

on

221 Views

భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
అభివృద్ధికి బాటలు వేద్దాం..
B.గిడ్డయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి…

 

దేవనకొండ సార్వత్రిక ఎన్నికలలో బిజెపి వైసిపి టిడిపి జనసేన, పార్టీలకు చెందిన అభ్యర్థులను రాష్ట్రము నుంచి తరిమికొట్టి,ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్, సీపీఐ,సీపీఎం అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందామని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తెలిపారు. ఆదివారం దేవనకొండ సీపీఐ కార్యాలయంలో సీపీఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసంద్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నమైనవని, ప్రధానంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ సమైక్యత, సమగ్రత,లౌకికవాదం ప్రధానమైన హక్కులు హరించే పద్ధతులలో పరిపాలన కొనసాగిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులమతాలను రెచ్చ గొట్టి గొడవలు సృష్టించి పరిపాలన కొనసాగిస్తున్నారని మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మెజార్టీగా ఉన్న హిందువుల ఓట్లను కొల్లగొట్టి తిరిగి అధికారం లోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని బిజెపి ప్రభుత్వానికి ఎదురు తిరిగి మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని అపహష్యం చేసే పద్ధతుల్లో సిబిఐ,ఈడి,లను పెంపుడు కుక్కల వలే వాడుకొని వ్యవస్థలను దుర్యోగం చేస్తూ, ప్రతిపక్ష పార్టీల నాయకులపై, ముఖ్యమంత్రుల పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థలైన టెలికాం ఎల్ఐసి రైల్వే చివరికి అంతరిక్ష పరిశోధన కేంద్రాలను కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం చేయలేక ప్రతి ఏడాది యువజనలకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 100 రోజులలో అధిక ధరలు తగ్గిస్తామని, ఇతర దేశాలలో ఉంటున్న నల్లధనాన్ని రప్పించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తానని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జరగబోవు ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఐదేళ్ల కాలంలో ప్రజలపై భారాలు మోపనని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన వై.ఎస్.జగన్ రెడ్డి ఏడుసార్లు కరెంటు చార్జీలు పెంచారని,నాలుగు సార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని,రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారని,నగరాల్లో పట్టణాల్లో ఇంటి పన్నులు,నీటి పన్నులు పెంచి కొత్తగా చెత్త పన్ను కూడా వేశారని, సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల ప్రజల దగ్గర నుండి గుంజుతున్నారని,రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి అవినీతి కేసుల కోసం అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు వైఎస్ జగన్ రెడ్డి,చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కాళ్ల కింద మోకరిల్లారని దీని కారణంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, అన్యాయం చేసిన బిజెపితో పరోక్షంగా,ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని అంటగాగుతున్న వైసీపీ, తెలుగుదేశం,పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, ఓడించాలని, ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న అసెంబ్లీ,లోక్సభ అభ్యర్థులను గెలిపించాలని, దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నబి రసూల్ ,కే మద్దిలేటి శెట్టి ,డి రాజా సాహెబ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎన్ కృష్ణయ్య, సయ్యద్, సుల్తాన్, సాహెబ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కృష్ణ,రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు కండప్ప, రైతు సంఘం మండల సీనియర్ నాయకులు తిమ్మప్ప,సిపిఐ మండల నాయకులు ఈరన్న,రాజన్న, మహేశ్వరప్ప, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

21 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
191 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

181 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters