Connect with us

Politics

రికార్డుస్థాయిలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు 13 లక్షల మంది గుర్తింపు దరఖాస్తుదారుడి ఇంటికి సిబ్బంది

Published

on

187 Views

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17 ( నేటి భారత్ ): రాష్ట్రంలో ఈసారి రికార్డుస్థాయిలో పోస్టల్‌ ఓట్లు నమోదు కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు గుర్తించారు. దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం కల్పించడమే దీనికి ప్రధాన కారణం. గతానికి భిన్నంగా ఈసారి ఉద్యోగుల కోసం వారి ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ప్రత్యేకంగా పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో దివ్యాంగులు 5.06 లక్షల మంది, 80 ఏండ్లు పైబడిన వారు 4.44 లక్షలు, 100 ఏండ్లు పైబడిన వారు 7 వేలకు పైగా, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 2.01 లక్షలు, పోలీసులు దాదాపుగా లక్షకు పైగా ఉన్నారు. వీరితోపాటుగా అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారు 33 వేల మంది, సర్వీసు ఓటర్లు 15 వేలు మొత్తం 12,95,007 మందిని పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులుగా తేల్చారు.

గతంలో కేవలం ఎన్నికల విధుల్లో ఉన్న వారికి, సర్వీసు ఓటర్లకు మాతమ్రే పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉండేది. కానీ, కరోనా నాటి నుంచి దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి ఈ అవకాశం కల్పించారు. దీంతో పోస్టల్‌ ఓట్లు ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షల్లో ఓట్లు ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి అభ్యర్థులు ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్లపై దృష్టి సారించే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసుకుంటేనే..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవాలనుకునే వారు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన 5 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. నవంబర్‌ 8 వరకు ఫారం-12డీ ద్వారా దరఖాస్తు చేయాలి. దివ్యాంగులు, వయోవృద్ధులు స్థానికంగా ఉండే బీఎల్‌వోల ద్వారా, ఉద్యోగులు వారి కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తారు. వయోవృద్ధులు వారి వయసును ధ్రువీకరించే పత్రాలు జతచేయాలి. దివ్యాంగులు 40% కంటే వైకల్యం ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వయోవృద్ధులు, దివ్యాంగులు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? అనేది పోలింగ్‌ స్టేషన్ల వారీగా రిటర్నింగ్‌ అధికారి మ్యాపింగ్‌ చేస్తారు. ఏ గ్రామంలో, ఏ పోలింగ్‌ బూత్‌లో, ఏ రోజు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించేది రాజకీయ పార్టీలకు కూడా సమాచారం అందిస్తారు.

రహస్యంగా ఓటు వేసేలా..

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం పోలింగ్‌ స్టేషన్‌కు ఒక బృందాన్ని రిటర్నింగ్‌ అధికారి నియమిస్తారు. ఈ బృందంలో మైక్రో అబ్జర్వర్‌, బీఎల్‌వో, వీడియోగ్రాఫర్‌ ఉంటారు. వారి ఇండ్లకు వెళ్లి, అక్కడ కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసి రహస్యంగా ఓటు వేసేలా చూస్తారు. ఇలా ప్రతి ఓటుకు సంబంధించిన ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డ్‌ చేస్తారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు వారికి ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ వేయడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడే ఓటు ఇస్తారు. అక్కడే ఓటు వేయాలి. గతంలో ఉద్యోగుల ఓటు హక్కు విషయంలో వచ్చిన ఫిర్యాదులతో ఒకే దగ్గర ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ అంతా నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించాక ప్రారంభమవుతుంది.

ఎన్నికల కంటే ముందే..

ఈ ప్రక్రియను ఎన్నికల తేదీ నవంబర్‌ 30 కంటే ముందుగా ముగిస్తారు. వీటన్నింటిని రిటర్నింగ్‌ అధికారి భద్రపరిచి, ఆ తర్వాత స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌లో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పోలింగ్‌ బూతులో ఓటు వేస్తామంటే నిబంధనలు అంగీకరించవు

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

23 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది సీతారాం ఏచూరి…… ఘనంగా సితారాం ఏచూరి కి నివాళి…

Published

on

147 Views

భారత దేశ రాజకీయాల్లో పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్,మాజీ విద్యార్థి సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ ఉచ్చిరప్ప, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు సిపిఐ మండల కార్యదర్శి నరసరావు మాజీ రైతు సంఘం నాయకులు ఉప్పర నరసప్ప లు పేర్కొన్నారు.

గురువారం నాడు దేవనకొండ మండల కేంద్రంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ స్థానిక ముగితాత ఆవరణలో జరిగింది.

పార్టీ జిల్లా నాయకులు బి వీర శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు సీతారాం ఏచూరి అని రాజకీయాలు ఏమైనా సమస్యల ప్రతిపాదికన చట్టసభల్లోను అదేవిధంగా పార్లమెంట్ బయట అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగ విలువలు కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణకై కట్టుబడి పని చేశారని పేర్కొన్నారు.

సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దళిత గిరిజన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాడినడ వ్యక్తి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు.

వివిధ భావాలు, సిద్ధాంతాలు ఉన్న రాజకీయాల్లో అందరినీ కలుపుకొని సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఉమ్మడి పోరాటం చేశారని పేర్కొన్నారు.

విద్యార్థి దశలోనే జేఎన్టీయూ నాయకుడిగా ఇందిరా గాంధీ నిలదీసి విసీ పదవికి రాజీనామా చేయించారని, విద్యార్థి నాయకుడిగా అందరికీ విద్యానదించాలనే పోరాటాన్ని దేశవ్యాప్తం చేశాడని పేర్కొన్నారు.

తదనంతర రోజుల్లో ప్రజా నాయకుడిగా తిరుగులేని నేతగా ఎదిగాడని భారతదేశ మౌలిక పరిస్థితులు సాంప్రదాయాలను అర్థం చేసుకొని దేశ ప్రజానీకానికి తగ్గట్టు చట్టాలు ఉండాలని పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు కమ్యూనిస్టు పార్టీలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన సీతారాం తన మేధస్సునంత ఉపయోగించి భారతదేశానికి విశేష సేవ అందించారని అనేక రైతాంగ కార్మిక విద్యార్థి యువజన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని విజయాలు సాధించారని పేర్కొన్నారు.

భారతదేశంలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి దౌత్యవ్యక్త గా వివాదాల పరిష్కారకునిగా భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారని పేర్కొన్నారు.

ఆయన నడిచిన బాటలో పేద మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడమే ఈరోజు మనందరి బాధ్యతని పేర్కొన్నారు. సీతారాం గారికి నిజమైన నివాళి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడమేనని భవిష్యత్తులో వామపక్షాలు ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడంలో అందరూ సహకరిస్తారని పేర్కొన్నారు.

సమ సమాజ నిర్మాణం కోసం ఆయన కన్న కలలు నిజం చేసే విధంగా నేటి కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుందని ఆ బాధ్యత నేటితరం భుజాన చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ఆ పార్టీ ప్రజాసంఘాల నాయకులు అశోక్, సూరి ,యుసుప్ బాషా, మహబూబ్ బాషా, బజారి, గాజుల శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, నాగేష్ ,మహేంద్ర ,నాగేంద్ర, బలరాముడు, వీరేంద్ర ,పరమేష్ ,జ్యోతి వెంకటేష్ ,మనోహర్ ,సుధాకర్, రవి ,సుభాన్ ,సుంకన్న, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Andhrapradesh

సీతారాం ఏచూరి మృతి వామ పక్షలకు ,దేశ రాజకీయాలకు తీరని లోటు…..సిపిఎం

Published

on

119 Views

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి  మృతి వామపక్షాలకి,అదే విధంగా దేశంలోని అభ్యుదయ లౌకిక, ప్రత్యామ్నాయా రాజకీయాలకు తీరనిలోటని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి. వీరశేఖర్ పార్టీ మండల కమిటీ సభ్యులు యూసుఫ్ భాష లు పేర్కొన్నారు.

సీతారం ఏచూరి గారి మృతి నేపథ్యంలో మండల కేంద్రం దేవనకొండలో ఆయనకు ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించాయి ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకులు అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చదువులో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఏచూరి  జేఎన్టీయూ ఢిల్లీ కేంద్రంగా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారని, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) లో చేరి అఖిల భారత అధ్యక్షులు పనిచేశారని తర్వాత జరిగిన పరిణామాలలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా నిలబడ్డారని జైలుకెల్లారని పేర్కొన్నారు.

నిరంతరం ప్రజల పక్షాన, కార్మికులు, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని , అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సమస్యలపై విశేష అవగాహనతో ఆయా దేశాలతో సత్సంబంధాలు నేర్పడంలో క్రియాశీలక పాత్ర పోషించే వారిని ఈ నేపద్యంలోనే భారత ప్రభుత్వం తరఫున నేపాల్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.

అభ్యుదయ ,లౌకిక ప్రత్యామ్నాయ రాజకీయాలలో మొదటి తరం నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ నేటికీ విశేష పోరాటాలు చేశారని దేశంలో అన్ని రాజకీయ పార్టీ లను ఒక వేదిక పైకి తీసుకురావడంలో విజయవంతం మైన పాత్ర నిర్వహించారని పేర్కొన్నారు ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి కాకుండా దేశ రాజకీయాలకు లోటని పేర్కొన్నారు.

మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా , అత్యుత్తమ రాజకీయవేత్తగా దేశానికి విశేష సేవ అందించాలని ఆయన లేని లోటు తీర్చలేనిదని భవిష్యత్తులో శ్రామిక వర్గ పోరాటాలే ఆయనకు ఘన నివాళి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ప్రజాసంఘాల నాయకులు పాండు, వెంకటేష్, కాంతయ్య, రవి, రాముడు, రంగన్న ,తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters