Connect with us

Andhrapradesh

సీబీఐ, ఎఫ్.బీఐ కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉండవల్లి ఏ విచారణ కోరుకున్నా మాకు అభ్యంతరం లేదు

Published

on

147 Views

లక్షల మందికి ఉపాధి కల్పించిన స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ అంటున్న ఉండవల్లికి ఏపీలో జరుగుతున్న మద్యం, మైనింగ్ కుంభకోణాలు కనిపించడం లేదా

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై ఉండవల్లి సీబీఐ విచారణ కోరడం వెనుక ఎవరున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు

వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడిగా చిత్రీకరించలేరు. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

వెంకటాచలం మండలం చవటపాళెంలో నిర్వహించిన ప్రజావేదికలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినా ఈ రోజుకీ ఈసమెత్తు అవినీతి జరిగినట్టు చూపలేకపోయారు

36 మందిపై కేసు బనాయించిన తర్వాత 37వ నిందితుడిగా చంద్రబాబు నాయుడిని చేర్చారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు పెట్టారు

ఈ రోజుకీ ఫలానా లావాదేవీలో అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. మొదట 3 వేల కోట్లు, ఆ తర్వాత 370 కోట్లు అన్నారు

చివరకు రూ.27 కోట్లు పార్టీ ఫండ్ కింద వచ్చిందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్నారు. ఆ రూ.27 కోట్లు కూడా ఎలక్ట్రోరల్ బాండ్లు

వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీబీఐ విచారణ జరగాలని మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు

సీబీఐ, సీఐఏ, ఎఫ్.బీ.ఐ కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఏ విచారణను ఉండవల్లి కోరినా మాకు అభ్యంతరం లేదు

ఏ విచారణ జరిపించుకున్నా ఒక్క అవినీతి రూపాయి జరిగినట్టు చూపించే అవకాశమే లేదు

జగన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుబెట్టుకుని రూ.43 వేల కోట్ల అక్రమాస్తులు కూడగట్టినట్టు సీబీఐ, ఈడీ ఆధారాలతో సహా నిరూపించాయి.

ఆ కేసుల్లో జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా జైలు జీవితం గడిపివచ్చారు

ప్రజాప్రతినిధులపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ ఏడాదిలో పూర్తికావాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నారు

మేధావినని చెప్పుకునే ఉండవల్లికి అవి కనిపించడం లేదా..అలాంటి వాటిని ప్రశ్నించలేరా

కరెన్సీ నోటుకు తప్ప డిజిటల్ గా ఏ రూపంలో మద్యం విక్రయించబోమని జగన్ రెడ్డి పట్టుబట్టి భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు

ఏపీ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన ఉండవల్లి దానిపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదు

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో రూ.100 మద్యం స్కామ్ జరిగిందని ఎందరో ప్రముఖులతో పాటు డిప్యూటీ సీఎంని సైతం ఇప్పటికీ జైలులో పెట్టివున్నారు

ఏపీలో మద్యం, ఇసుకలో కలిసి నెలకు రూ.500 కోట్ల వరకు స్కాం జరుగుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఇది కనిపించడం లేదా

రాష్ట్రంలో ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యాన్ని ఓ వారం పాటు తాగే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఉందా

మీరు మాత్రం విలాసవంతంగా గడుపుతారు. పేదలు మాత్రం నాసిరకమైన మద్యం తాగి చావాలి

14 ఏళ్లుగా రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించి, నిజాయతీపరుడిగా గుర్తింపుపొందిన నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుంటే ఉండవల్లికి ఆనందంగా ఉందా

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, భూదందాలు, కక్షసాధింపులు, వేధింపులు, దొంగ కేసులేమీ ఉండవల్లికి కనిపించడం లేదా

2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన స్కిల్ డెవలప్మెంట్ పై సీబీఐ విచారణ కోరుతారా

ఏ విచారణ కోరినా వెంట్రుక కూడా పీకలేరు. చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడిగా చిత్రీకరించాలంటే మీ తాతలు దిగివచ్చినా సాధ్యం కాదు

ఇప్పటి వరకు ఒక పెద్దమనిషిగా చెలామణి అయిన ఉండవల్లి ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు

జగనన్న కాలనీల పేరుతో హడావుడి చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టడం లేదు

పేదలకేమో ఇరుకిరుకు ఇళ్లు కట్టిస్తూ ముఖ్యమంత్రి కోసం రిషికొండ ప్యాలెస్ ఒక్క లెట్రిన్ కమోడ్ కోసమే రూ.25 లక్షలు వెచ్చించారట

సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కూడా విదేశాల నుంచి కోట్ల రూపాయలతో సామగ్రి తెచ్చి విలాసవంతమైన కరోనా ప్యాలెస్ కట్టించుకున్నారు

సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు అడ్డంగా దోచేసి విలాసవంతమైన రాజభవనాలు కట్టుకుంటున్నారు. పేదలకు మాత్రం సెంటు స్థలంలో ఇల్లులంట

రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

20 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
190 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

180 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters