Andhrapradesh
శాస్త్రీయ విద్యా విద్యావిధానానికై పోరాటాలకు సిద్ధం కావాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్.
దేశంలో శాస్త్రీయ విద్యావిధానానికై పోరాటాలు నిర్వహించడానికి విద్యార్థులందరూ సన్నద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక, విద్యావ్యవస్థను మరింత చీకట్లోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాస్త్రీయత లేని చదువులు ప్రవేశపెట్టి, విద్యార్థుల యొక్క మెదళ్ళకు మరింత బూజును పట్టించే విధంగా తయారు చేస్తుందని అన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరుతో విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకోస్తున్నామని చెప్పి, జ్యోతిష్యాలు,పురాణ గాథలు, చిలక పంచాంగాలకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టి, విద్యా కాషాయకరణ చేస్తుందని అన్నారు.
అంతేకాకుండా భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని,పోరాడి ప్రాణాల అర్పించిన భగత్ సింగ్ లాంటి పోరాట యోధులు జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా ఉన్న వాటిని తొలగించి, పరాయి పాలకులకు తొత్తుగా వ్యవహరించిన వారి యొక్క జీవితాన్ని పాఠ్యాంశాలుగా చేర్చి, చరిత్రను వక్రీకరిస్తుందని అన్నారు.
దేశంలో విదేశీ యూనివర్సిటీలను స్వాగతించి, స్వదేశీ యూనివర్సిటీ ల మనుగడను లేకుండా చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి విద్యాసంస్థల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని అనేక మాటలు చెప్పి, తీరా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులను నట్టేట ముంచేశారని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ తానా అంటే రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి తందానా అంటున్నారని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా నూతన విద్యా విధానాన్ని అమలు చేశారని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, మండల అధ్యక్షులు మధు, మండల నాయకులు మల్లి,నరేష్, సింహాద్రి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh1 year ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh1 year ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh1 year ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh1 year ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh5 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh5 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Telangana1 year ago
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
-
Andhrapradesh12 months ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం