Connect with us

Andhrapradesh

కరువు వలసలు నివారించడంలో అధికారుల వైఫల్యం.

Published

on

213 Views

ష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి.

దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినప్పటికీ కరువు సహాయక చర్యలు ఇప్పటివరకు చేపట్టకపోవడంపై సీపీఐ ధర్నా.

ఇటీవల ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు కానీ ఇప్పటివరకు కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం వలన వ్యవసాయ కూలీలు రైతులు సుదూర ప్రాంతాలకు వలసలకు వెళ్తున్నారు. వలసల నివారణ చర్యలో భాగంగా తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసారావు లు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పట్టణ సహాయ సి.కృష్ణ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..


దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినంత మాత్రాన సరిపోదన్నారు.తక్షణమే పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేయాలన్నారు.ఒక ఎకరాకు 40,000 వేల రూపాయల నుండి లక్ష రూపాయల దాకా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

రాబోయే ఖరీఫ్ సీజన్ కు 90% సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు రైతులకు ఇవ్వాలన్నారు.బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేయాలన్నారు. వలసలను నివారించి, జాతియ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి, 200 రోజులు పనులు కల్పించాలి 600 కనీస వేతనం ఇవ్వాలన్నారు.

ఇన్సూరెన్స్ డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు. తక్షణమే పశువులకు మేత ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు. కరువు మండలంగా ప్రకటించి నందున తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ ధర్నా ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు కోటకొండ హరిచంద్ర, నల్లచెలిమల బజారి, కరివేముల బాలాజీ, పాలకుర్తి అశ్వద్ధామ, సుల్తాన్, శ్రీనివాసులు, కోదండ, మహమ్మద్, రాముడు, రమేష్, దస్తగిరి, వెంకటరాముడు, మిన్నళ్ల, వీరస్వామి, రామాంజనేయులు, భాష, మహదేవ, మహేష్, విద్యార్థి, యువజన సంఘం నాయకులు భాస్కర్, మధు, రామాంజనేయులు, నాగేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

21 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
191 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

181 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters