Connect with us

Andhrapradesh

సీయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి బుడగ జంగాల సమస్య తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చినఆలూరు వైసిపి ఇంచార్జ్ బి.విరుపాక్షి .

Published

on

193 Views

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గం
వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విరుపాక్షి కి వినతి.

బుడగ జంగాలకు ఇళ్లస్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

బుడగ జంగాలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలి.

బుడగ జంగాల డేరాల దగ్గరికి వెళ్లి వాళ్ల స్థితిగతులు తెలుసుకున్న విరుపాక్షి.

దేవనకొండ మండల కేంద్రమైన దేవనకొండలో 60 సంవత్సరాలుగా డేరాలేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి బుడగజంగాలను ఆదుకోవాలని వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని అదేవిధంగా ఏళ్ల తరబడి వారికి కుల సర్టిఫికేట్ లేదని అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కాలేదని తక్షణమే బుడగ జంగాల సమస్యను పరిష్కరించే విధంగా వారికి కుల సర్టిఫికెట్లు మంజూరు చేసి అదే విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆలూరు నియోజకవర్గ కార్యదర్శి మునిస్వామి ఆధ్వర్యంలో ఆలూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ విరుపాక్షికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా విరూపాక్షి బుడగజంగాలు వేసుకున్న డేరాల దగ్గరికి వెళ్లి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకొని వారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆలూరు నియోజకవర్గం కార్యదర్శి మునిస్వామి మాట్లాడుతూ బుడగ జంగాల యొక్క పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయని ఇప్పటికీ వారికీ వారి కులం ఏదో ప్రభుత్వం గుర్తించలేదని ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా బుడగ జంగాల యొక్క స్థితిగతులు ఏమాత్రం మార్పు రాలేదని వీరిని కేవలం ఎన్నికల్లో ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తూ గెలిచిన అనంతరం ఎవరు కూడా పట్టించుకోవడంలేదని దీనివల్ల వారు ఊరికి దూరంగా జీవనం కొనసాగిస్తూ నివసించడానికి ఇల్లు లేవు డేరాలు వేసుకొని ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో తాత్కాలికంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు.

వీరి పిల్లలు ఇప్పటిదాకా చదువుకోవడానికి కుల సర్టిఫికెట్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వీరి కులంలో చదువుకోవడానికి అవకాశం లేక చదివించలేక వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి తక్షణమే వీరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అంతే కాకుండా కుల సర్టిఫికేట్ కి విచారణ చేసి వీళ్లకు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి కోరడమైనది. అందుకు స్పందించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ విరుపాక్షి జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులకు మరియు బుడగ జంగాలకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి హర్షవర్ధన్ రెడ్డి , అలరిదిన్నె ప్రభాకర్ రెడ్డి మోహన్ రెడ్డి, ప్రేమ్నాథ్ రెడ్డి , నారాయణరెడ్డి నిర్జల్ రెడ్డి సుధాకర్ రెడ్డి, పాలకుర్తి ప్రతాప్, ఎంకే కొట్టాల గఫూర్ పోట్లపాడు కేశవ ఆనంద్ వెంకటాపురం శంకరయ్య, వెలమకూరు జయన్న, తదితర వైఎస్ఆర్సిపి నాయకులు బుడగ జంగాల కులస్తులు అందరూ పాల్గొనడం జరిగింది

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

20 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
190 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

180 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters