Connect with us

Andhrapradesh

జగన్ రాకతో… ప్రజాధనం దుర్వినియోగం: టిడిపి.

Published

on

144 Views

సభలో… సాగునీటి ప్రాజెక్టుల ఊసే లేదు.

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి తనయుడు టిక్కెట్ కోసం ఉన్న ఆరాటం, నియోజకవర్గ అభివృద్ధిపై లేదు.



జగనన్న చేదోడు పథకం కింద నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరుకు రావడంతో ప్రజాధనం దుర్వినియోగం అయింది తప్ప ఒరిగింది ఏమీ లేదని టిడిపి నేతలు మండిపడ్డారు.

మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టిడిపి నేతలు స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభలో సీఎం జగన్ పెండింగ్ ప్రాజెక్టులైన వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, ఎల్. ఎల్.సి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనుల గురించి ప్రస్తావించకపోవడం కర్నూలు జిల్లా పై ఆయనకు ఉన్న ప్రేమ ఏ పాటిదో స్పష్టంగా అర్థమైందన్నారు. స్థానిక శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి హంద్రీ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలన్న వినతి మినహాయిస్తే..! ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగింది శూన్యమన్నారు.

తనయుడు టికెట్ కోసం ఉన్న ఆరాటం అభివృద్ధిపై లేకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మిగనూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుండి ఎమ్మిగనూరు పట్టణానికి 86 కీ. మీ. మేరకు పైప్ లైన్ ద్వారా త్రాగునీటి ప్రాజెక్టును ఏ.ఐ.ఐ.బి. పథకము ద్వారా రూ.148 కోట్లు నిధులను టిడిపి హాయంలో మంజూరు చేయించడం జరిగిందని, అలాగే చేనేతల ఉపాధికై 2015 మే 2 న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత బనవాసి గ్రామంలో టెక్స్ టైల్స్ పార్కు కోసం 91.31 ఎకరములను భూమి కేటాయించి నిధులు కేటాయిస్తే దీనిని ఇతర జిల్లాలకు వైసిపి ప్రభుత్వం తరలించిందని వీటి అమలుకు విన్నవించకపోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

అసంపూర్తిగా ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని సీఎం జగన్ పూర్తి చేశారని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చెప్పడంలో వాస్తవం ఏమాత్రం లేదన్నారు. నాగలదిన్నె బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ సహాయంలో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి చొరవతో రూ.42 కోట్లు విడుదల చేయించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎమ్మిగనూరు పట్టణంలో..100 పడకల ఆసుపత్రి టిడిపి హాయంలోనే మంజూరు అయిందని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అభివృద్ధి వరాలు కురిపించకుండా ఊకదంపుడు ప్రసంగం చేయడంతో ఒరిగింది జరిగింది ఏమీ లేదని దుయ్యపడ్డారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు సహకారంతో.. మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్ప ర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మాసుమాన్ దొడ్డి శ్రీనివాసులు, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. అబ్దుల్ జబ్బార్,ఆఫ్గాన్ వలిభాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు దర్జీ మోషన్న,యస్.సాల్మన్, జాలవాడి ఏసన్న, పందికోన సురేష్, కె. తిమ్మాపురం గ్రామ నాయకులు కురువ వీరేష్, మార్కు తదితరులు పాల్గొన్నారు.

Andhrapradesh

గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Published

on

23 Views

రైతులకు గిట్టుబాటు ధరల హామీ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి! డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు కాగితాల్లో మాత్రమే మిగిలిపోవాలి కాదు, అమలులోకి రావాలి! జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి!

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 200 రకాలకుపైగా పంటలు పండితే, కేవలం 20-25 పంటలకే మద్దతు ధర ప్రకటించడం కక్ష సాధింపు చర్య కాదు అంటే ఏమిటి? అదీ కూడా మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చినట్లు నటిస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చి ధర ₹17,000 ఉండగా, ప్రభుత్వం ₹11,700 ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఒకరికి రూ. 5,000 కట్ చేసి మరొకరికి వేల కోట్లు మాఫీ చేయడమేనా పాలన?

రైతుల పేరిట ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను పక్కన పెట్టే ప్రభుత్వాలను భరించేది లేదు! ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరమే కాదు. రైతుల శ్రమ, కష్టం, కన్నీళ్ల మీద నిర్మించుకున్న భవనాలే కాదా? మద్దతు ధర ఇవ్వకపోతే వ్యవసాయమే క్షీణించిపోతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులను మోసం చేసే ముఠాలను అరికట్టాల్సింది పోయి, రైతుల్ని రెక్కల ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారా?

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ క్షమించరు! ప్రభుత్వం గట్టిగా స్పందించకపోతే, రైతు చైతన్య యాత్రలు చేస్తాం, పోరాటాలు మిన్నంటిస్తాం! రైతు సంఘం దీక్షలు, ఉద్యమాలు ఎంత దూరమైనా వెళ్లే వరకు వెనక్కి తగ్గేది లేదు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం నాయకులు కృష్ణ, రవికుమార్, అనుమప్ప, కోదండ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

4o
Continue Reading

Andhrapradesh

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

Published

on

కలెక్టరు రంజిత్ బాషాను కలిసిన వీరభద్ర గౌడ
194 Views

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..

Continue Reading

Andhrapradesh

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

Published

on

184 Views

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Home
Ap News
Login
Reporters