Andhrapradesh
సమ సమాజ స్థాపనే ధ్యేయంగా అమరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం CPI.

ఘనంగా CPI 99వ వార్షికోత్సవాలు.
అమరవీరుల స్ఫూర్తితో సమ సమాజ స్థాపనే ధ్యేయంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు లు పిలుపు నిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99 వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా మంగళవారం దేవనకొండ సీపీఐ శాఖ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయం ముందు సిపిఐ పట్టణం సహాయ కార్యదర్శి వడ్డె రాజశేఖర్ అధ్యక్షతన అరుణ పతాకాన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు కె.మద్దిలేటిశెట్టి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భారత కమ్యూనిస్టు పార్టీ CPI 1925 సంవత్సరం డిసెంబర్ 26 వ తేదీ నాడు భారతదేశంలో కాన్పూర్ మహానగరంలో ఆవిర్భవించిందని, ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశానికి స్వాతంత్రం కావాలని జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో ఉండి పాల్గొన్నదని పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం ఆనాటి జాతీయ నాయకులు ఏళ్ల తరబడి కాన్పూర్,మీరట్, కుట్ర కేసులో ఇరుక్కుని జైల్లో నిర్బంధించబడ్డారని తెలిపారు.స్వాతంత్రం కోసం అనేకమంది ప్రాణాలు సైతం త్యాగం చేశారని, దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని మొదట తీర్మానం చేసిన పార్టీ సిపిఐ అని ఉద్ఘాటించారు.98 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో అనేక పోరాటాలు అనేక త్యాగాలు చేసి అనేక విజయాలను సాధించిన చరిత్ర సిపిఐ కు ఉన్నదని తెలిపారు.
నాటి నుండి నేటి వరకు పేద ప్రజలు, కార్మికులు,కర్షకులు, శ్రమజీవుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు, అశేషత్యాగాలు చేసిన ఘన చరిత్ర సిపిఐ కి ఉన్నదని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్రలేని బ్రిటిష్ వారికి ఊడిగం చేసిన ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు దేశాన్ని పరిపాలిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రజలను విడదీస్తూ ఘర్షణలు పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయని ఆరోపించారు.
దేశ రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వారికి గుణపాఠం చెప్పడానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపడానికి సమాయత్తం కావాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ప్రసాద్, రైతు సంఘం మండల కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, నల్లచెల్లిమెల శాఖ కార్యదర్శి బజారి, పాలకుర్తి శాఖ కార్యదర్శి అశ్వద్ధామ, కుంకనూరు శాఖ కార్యదర్శి గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కృష్ణ, అఖిల భారత యువజన సమాఖ్య మండల అధ్యక్ష కార్యదర్శులు రవి రామంజి అఖిల భారత విద్యార్థి సమాఖ్య మండల అధ్యక్ష కార్యదర్శులు మధు భాస్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బడే సాహెబ్ మండల నాయకులు సుల్తాన్ భాషా వీరాంజి విద్యార్థి యువజన సంఘాల నాయకులు రంగన్న ఫయాజ్ రామంజి నరేష్ శ్రీరంగడు ఆటో, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh1 year ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh1 year ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh1 year ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh1 year ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh5 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh5 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Telangana1 year ago
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
-
Andhrapradesh12 months ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం